సమైక్యం కోరుకుంటున్నా కానీ.., పిసిసి వదిలేస్తా: బొత్స
అయితే విభజన విషయంలో తమ పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం ఉంటే బాధాకరమైనా తాను వ్యతిరేకించనని చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
పదవుల కోసమే తెలంగాణపై నిర్ణయం విషయంలో రాజకీయమంటే తాను పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పదవుల కోసమే తెలంగాణ అన్నా తాను పిసిసి వదులకునేందుకు సిద్ధమన్నారు. తుడా చైర్మన్గా మాజీ శాసన సభ్యుడు వెంకటరమణను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారని, తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయన్నారు.
12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 12వ తేదిన ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు బదులు ఉదయానికి మారింది.