దేవేందర్ గౌడ్ కొడుకు వార్షిక ఆదాయం రూ. 720!

ఇంకా తన భార్య టి దివ్యశ్రీ ఆదాయం రూ. 610గా తెలిపారు. కాగా, వీరేందర్ గౌడ్ అమెరికాలోని బోస్టన్లోని బేబ్సన్ కాలేజి, మసచూసెట్స్లో తన ఎంబిఏను పూర్తి చేయడం గమనార్హం. వీరేందర్ గౌడ్ తనకు గల రూ. 58.27 కోట్లలో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు విలువ రూ. 27.49 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ. 29.60 కోట్లుగా ఉందని తెలిపారు. ఇవి కాకుండా శంషాబాద్, మహేశ్వరంలలో రూ. 1.9 కోట్లు, రూ. 1.59 కోట్ల విలువైన భూమి ఉన్నట్లు, తనకు రూ. 13.25 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన ఆదాయంపై తన మేనేజర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని వీరేందర్ గౌడ్ తెలిపారు. అయితే తన ఆదాయ వివరాలు నిజాయితీగా తెలిపానని చెప్పారు. తమది ఉమ్మడి కుటుంబమని, తనకు ఆదాయం లభించే వనరులు లేవని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో కొనసాగుతున్నాని తెలిపారు. తన పేరుతో ఒక కారు కూడా లేదని వీరేందర్ గౌడ్ చెప్పారు.
కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కార్తీక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్లో పన్ను చెల్లించే అదాయాన్ని రూ. 3.24 లక్షలుగా పేర్కొన్నారు. తన వృత్తి రాజకీయాలని అఫిడవిట్లో ఆయన తెలియజేశారు. చరాస్తులు రూ. 76.13 లక్షలు, స్థిరాస్తులు రూ. 2.55 కోట్లుగా ఉన్నట్లు కార్తీక్ రెడ్డి తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications