మేయర్ అనురాధ దంపతుల హత్య: చింటూ లొంగిపోతాడా?
హైదరాబాద్: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ కోర్టులో లొంగిపోవడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థకు అతని పేరిట ఓ లేఖ వచ్చింది.
మేయర్ దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని నిందితుడు చింటూ ఆ లేఖలో స్పష్టం చేశాడు. ఆయన పేరుతో తమకు ఓ లేఖ వచ్చినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలిపింది. పోలీసులు తనను టార్గెట్ చేశారని, కటారి దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని లేఖలో చెప్పాడు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే కోర్టులో లొంగిపోయి వాస్తవాలు చెబుతానని అందులో స్పష్టం చేశాడు. మీడియాలో కథనాలు, పోలీసుల ఇంటర్వ్యూలు చూస్తే తనకు నాకు ప్రాణహాని ఉందని అర్థమైందని అన్నారు.
అయితే లేఖతో చింటూకు సంబంధం ఉందా లేదన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ, మోహన్ దంపతులు ఈ నెల 4వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మంది నిందితులను గుర్తించారు. వీరిలో కొంత మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications