మేయర్ అనురాధ దంపతుల హత్య: చింటూ లొంగిపోతాడా?
హైదరాబాద్: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ కోర్టులో లొంగిపోవడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థకు అతని పేరిట ఓ లేఖ వచ్చింది.
మేయర్ దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని నిందితుడు చింటూ ఆ లేఖలో స్పష్టం చేశాడు. ఆయన పేరుతో తమకు ఓ లేఖ వచ్చినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలిపింది. పోలీసులు తనను టార్గెట్ చేశారని, కటారి దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని లేఖలో చెప్పాడు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే కోర్టులో లొంగిపోయి వాస్తవాలు చెబుతానని అందులో స్పష్టం చేశాడు. మీడియాలో కథనాలు, పోలీసుల ఇంటర్వ్యూలు చూస్తే తనకు నాకు ప్రాణహాని ఉందని అర్థమైందని అన్నారు.
అయితే లేఖతో చింటూకు సంబంధం ఉందా లేదన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ, మోహన్ దంపతులు ఈ నెల 4వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మంది నిందితులను గుర్తించారు. వీరిలో కొంత మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications