శ్రీవారికి రూ.2కోట్ల విలువైన స్వర్ణ ఖడ్గం బహూకరించిన భక్తుడు
తిరుపతి: తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ స్వర్ణాభరణం కానుకగా సమర్పించారు. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకలూర్కు చెందిన పారిశ్రామికవేత్త తంగదొరై దంపతులు.. రూ.2 కోట్ల విలువైన బంగారు ఖడ్గం తయారుచేయించి స్వామివారికి బహుకరించారు.

మంగళవారం వేకువ జామున సుప్రభాత సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వారు... ఆలయ అధికారులకు స్వర్ణసూర్య కఠారిని అందజేశారు. ఆరు కిలోల మేలిమి బంగారంతో ఆభరణాన్ని తయారు చేయించినట్లు తంగదొరై దంపతులు తెలిపారు.

1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరేంద్ర పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున శ్రీవారికి స్వర్ణసూర్య కఠారిని సమర్పించారు. ఆ తర్వాత శ్రీవారికి ఇలాంటి కానుక అందడం ఇదే తొలిసారి. కాగా, తంగదొరై ఇప్పటి వరకు శ్రీవారికి రూ.5కోట్ల విలువైన ఆభరణాలను బహూకరించడం గమనార్హం.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications