శ్రీవారికి రూ.2కోట్ల విలువైన స్వర్ణ ఖడ్గం బహూకరించిన భక్తుడు
తిరుపతి: తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ స్వర్ణాభరణం కానుకగా సమర్పించారు. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకలూర్కు చెందిన పారిశ్రామికవేత్త తంగదొరై దంపతులు.. రూ.2 కోట్ల విలువైన బంగారు ఖడ్గం తయారుచేయించి స్వామివారికి బహుకరించారు.

మంగళవారం వేకువ జామున సుప్రభాత సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వారు... ఆలయ అధికారులకు స్వర్ణసూర్య కఠారిని అందజేశారు. ఆరు కిలోల మేలిమి బంగారంతో ఆభరణాన్ని తయారు చేయించినట్లు తంగదొరై దంపతులు తెలిపారు.

1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరేంద్ర పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున శ్రీవారికి స్వర్ణసూర్య కఠారిని సమర్పించారు. ఆ తర్వాత శ్రీవారికి ఇలాంటి కానుక అందడం ఇదే తొలిసారి. కాగా, తంగదొరై ఇప్పటి వరకు శ్రీవారికి రూ.5కోట్ల విలువైన ఆభరణాలను బహూకరించడం గమనార్హం.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications