జనవరి 14 వరకు చెడు కాలం: శుభకార్యాలకు దూరంగా ఉండడం ఉత్తమం
ఖర్మాస్ 2025 డిసెంబర్ 16న ప్రారంభమై, హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభకార్యాలకు విరామం ఇచ్చే కాలాన్ని సూచిస్తుంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఖర్మాస్ మొదలవుతుందని జ్యోతిష్య నమ్మకం. ఈ కాలంలో సూర్యుని ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రధాన వేడుకలు, నూతన ప్రారంభాలను ఈ సమయంలో వాయిదా వేస్తుంటారు.
సూర్యుడు ప్రతి ఏటా రెండుసార్లు ధనస్సు లేదా మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలం వస్తుంది. ఈ రెండు రాశులకు అధిపతి గురుడు (బృహస్పతి). ఈ సమయంలో సూర్యుడు గురుగ్రహ ప్రభావంతో విశ్రాంతి తీసుకుంటాడని గ్రంథాలు, జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు. ఆధ్యాత్మిక సాధనలు, దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనది.

గ్రహ దోషాలను తగ్గించి, దైవ ఆశీస్సులను పొందడానికి ఈ సమయం ఉత్తమమని నమ్ముతారు. ముఖ్యంగా సూర్యదేవుడు, బృహస్పతి అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. జ్యోతిష్యంల ప్రకారం డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:26 గంటలకు సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఖర్మాస్ ప్రారంభమైంది. సూర్యుడు ఈ రాశిలో 2026 జనవరి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి మారతాడు. ఈ మార్పుతో మకర సంక్రాంతి రోజున ఖర్మాస్ ముగుస్తుంది.
శుభకార్యాలకు అనుకూల ముహూర్తాలు తిరిగి వస్తాయి. ఖర్మాస్ 2025 సమయంలో కొన్ని ప్రధాన శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. వీటిలో వివాహాలు, నిశ్చితార్థాలు, పిల్లల నామకరణం, శిరోముండనం, ఉపనయనం వంటి సంస్కారాలు కూడా ఈ కాలంలో చేపట్టడం మంచిది కాదని చెబుతారు.
కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం, ఆస్తి కొనుగోళ్లు, వాహనాలు కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా ఈ కాలంలో నివారించాలి. ఖర్మాస్ సమయంలో ఇలాంటి కార్యకలాపాలను ప్రారంభించడం ఆలస్యాలకు, ఆటంకాలకు లేదా ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని జ్యోతిష్య నమ్మకం.
భౌతిక కార్యకలాపాలకు పరిమితులు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక వృద్ధికి, దోష నివారణలకు ఖర్మాస్ చాలా ప్రయోజనకరమైన సమయం. ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నీరు, కుంకుమ, ఎర్రటి పువ్వులు, బియ్యం కలిపి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్ఠం. అలాగే, మంత్ర పఠనం, ధ్యానం, తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
వీలైతే గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఆవులు, బ్రాహ్మణులు, పేదల సేవలో పాల్గొనడం శ్రేష్ఠం. ఈ కాలంలో కనీసం ఒకసారైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోయి, దైవ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
పండుగలకు అశుభకరమైనదిగా భావించినా, ఖర్మాస్ ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం. ఈ కాలంలో నిష్ఠతో కూడిన భక్తి, దానధర్మాలు, క్రమశిక్షణ దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం, సానుకూల మార్పులను తెస్తాయని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఖర్మాస్ 2025 సమీపిస్తున్నందున, భక్తులు తమ లౌకిక ఆకాంక్షలను తగ్గించుకుని, అంతర్ముఖులై విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించుకోవాలి.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications