లాక్ డౌన్పై నిర్ణయం రాష్ర్ట ప్రభుత్వాలదే: కిషన్ రెడ్డి
లాక్ డౌన్ పొడగింపుపై సందిగ్దత నెలకొంది. రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ నోట్ కూడా విడుదల చేసింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లాక్ డౌన్పై కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసినా.. రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం అని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది.
జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ పెట్టుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదేనని కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి లాక్డౌన్ విధించుకోవచ్చని చెప్పారు. ఆనందయ్య మందును ఏపీ ప్రభుత్వం.. ఆయుష్ డిపార్ట్మెంట్కు పంపితే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆనందయ్య మందులా దేశ నలుమూలల నుంచి తమకు వేల విజ్ఞప్తులు వస్తున్నాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
కాక్టెయిల్ మందు ఉత్పత్తిపై కేంద్రం పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బయట రేట్ల వివరాల బోర్డులు పెట్టాలని, ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించే బాధ్యత రాష్ట్రాలదేనని కిషన్రెడ్డి చెప్పారు. నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్పస్టంచేశారు. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం పేరుతో నోట్ రావడంతో చర్చ జరిగింది. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.