Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తం, కాల్పుల్లో నలుగురు రైతులు మృతి, పోలీసుల రివర్స్ గేర్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైతులు కొన‌సాగిస్తున్న‌ ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టడంతో వారిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగు

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైతులు కొన‌సాగిస్తున్న‌ ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టడంతో వారిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో ఒక రైతు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కాల్పుల్లో మ‌రికొంద‌రు రైతులు తీవ్ర‌ంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గరు రైతులు మృతిచెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

4 dead as security forces open fire on farmers protesting in MP’s Mandsaur

అయితే అక్కడి పోలీసు అధికారులు మాత్రం ఆందోళన చేస్తున్న రైతుల‌పై పోలీసులు కాల్పులు జరపలేదని, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎవరో కాల్పులు జ‌రిపార‌ని, తాము ఈ ఘటనపై ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని చెబుతున్నారు.

మరోవైపు రైతుల ఆందోళ‌న కార‌ణంగా ఎటువంటి వదంతులు వ్యాపించ‌కుండా మాండ్ సౌర్ స‌హా ప‌లు ప్రాంతాల్లో అంత‌ర్జాల సేవ‌లు నిలిపివేశారు. రైతులు కూడా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

గిట్టుబాటు ధర కల్పించాలని, త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలని డిమాండ్ చేస్తూ మ‌ధ్యప్ర‌దేశ్‌లో కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవ‌లే ఆ రాష్ట్రంలో రైతుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొని, చ‌ల్ల‌బ‌డింది. మళ్లీ మంగళవారం తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+