ఆపిల్ ఐఫోన్ల తయారీ బెంగళూరులోనే : అధికారిక ప్రకటన
అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ భారత్ లో ఐఫోన్ల తయారీపై తొలిసారిగా అధికారికంగా ప్రకటన వెలువడింది.
బెంగళూరు: అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ భారత్ లో ఐఫోన్ల తయారీపై తొలిసారిగా అధికారికంగా ప్రకటన వెలువడింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి బెంగళూరులో ఈ కంపెనీ ఐఫోన్ల తయారీ ప్రారంభించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
సాఫ్ట్ వేర్ సిటీ బెంగళూరులో తైవాన్ కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ మరో రెండు నెలల్లో ఫోన్ల తయారీ ప్రారంభిస్తుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే వెల్లడించారు. ఆపిల్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)గా ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్.. ఐఫోన్ల తయారీ వ్యవహారాలను చూస్తుంటుంది.

ఆపిల్ ఐఫోన్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ప్రియా బాలసుబ్రహ్మణ్యం, ఐఫోన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ధీరజ్ చుగ్, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ మేనేజర్ అలీ ఖనాఫర్ తదితరులతో కర్ణాటక మంత్రులు, అధికారులు సమావేశమైనట్లు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లు తయారు చేస్తున్న మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని ప్రియాంక ఖర్గే తెలిపారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications