నవంబర్ కంటే ముందు బ్యాంకు ఖాతాలను కూడ చూపండి
పెద్ద నగదు నోట్ల రద్దు చేసిన నవంబర్ 8వ, తేది కంటే ఆరు మాసాల బ్యాంకు లావాదేవీలను బిజెపి ఎంపిలు విడుదల చేయాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.నగదు రద్దు వ్యవహరం మోడీ మిత్రులకు ముం
న్యూడిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బిజెపి ప్రజా ప్రతినిధులు తమ బ్యాంకు లావాదేవీలను బహిరంగ పర్చాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన సూచనపై ఆప్ అధినేత డిల్లీ ముఖ్యమంత్రి ఘాటుగానే స్పందించారు. నవంబర్ 8వ, తేది ముందు రోజు కూడ వారి ఖాతాల వివరాలను కూడ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం బిజెపి ఎంపిలకు ముందే తెలుసునని బిజెపి పై డిల్లీ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు సమాధానంగా బిజెపి తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ తమ ఖాతాల వివరాలను వెల్లడించాలని కోరింది.నవంబర్ 8వ, తేది నుండి డిసెబబర్ 1వ, తేదివరకు ఎంపిల ఖాతాల లావాదేవీలను వెల్లడించాలని అమిత్ షా ఆదేశించారు.

నవంబర్ 8వ, తేది తర్వాత ఖాతా వివరాలు కాదు, అంతకు ఆరు మాసాల ముందు ఖాతా వివరాలను వెల్లడించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం మోడీ మిత్రులకు ముందే తెలుసునని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.జూలై నుండి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు చేరుకొందని ఆయన చెప్పారు.
బ్యాంకుల్లో జమ చేసిన నగదు ఇప్పటివరకు 8 కోట్లు ఉందని, ఈ నగదులో చిల్లిగవ్వ కూడ బ్లాక్ మనీ లేదన్నారు ఆయన. కరెన్సీ రద్దు ప్రయోగం విఫలమైందని ఆయన చెప్పారు.పెద్ద నగదు నోట్ల రద్దు విషయాన్ని ముందుగానే తన స్నేహితులకు చెప్పి మోడీ మేలు చేశారని ఆయన ఆరోపించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications