పీఎస్ఎల్వీ సీ42 విజయవంతం: యూకే ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో
Recommended Video

నెల్లూరు: పీఎస్ఎల్వీ సీ42 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బ్రిటన్కు చెందిన నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. ఈ రెండు ప్రయోగాలు భూమిని పరిశీలించనున్నాయి. ప్రయోగం విజయవంతంకావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు.
ఈ రాకెట్ 17.45 నిమిషాలకు 583 కి.మీ. ఎత్తుకు చేరుకుంది. భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిగాంశంపై సూర్య సమస్థితి కక్ష్యలో 483 కిలోల నోవాసర్ ఎస్, 444 కిలోల ఎస్1-4 ఉపగ్రహాలను విడిచింది. ఇప్పటి వరకు 243 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీని పంపడం 33వసారి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం రాత్రి పీఎస్ఎల్వీ సీ42 ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను పంపించారు. భూమి పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి.
శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 33 గంటల పాటు కొనసాగింది. ఆదివారం రాత్రి గం.10.08 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ సి42 రాకెట్ రూపకల్పనకు రూ.175 కోట్లు వరకు వ్యయం చేశారు. ఇది నాలుగు దశల రాకెట్. దీని పొడవు 44.4 మీటర్లు. ప్రయోగ సమయంలో బరువు 230.4 టన్నులు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications