పీఎస్ఎల్వీ సీ42 విజయవంతం: యూకే ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో
Recommended Video

నెల్లూరు: పీఎస్ఎల్వీ సీ42 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బ్రిటన్కు చెందిన నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. ఈ రెండు ప్రయోగాలు భూమిని పరిశీలించనున్నాయి. ప్రయోగం విజయవంతంకావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు.
ఈ రాకెట్ 17.45 నిమిషాలకు 583 కి.మీ. ఎత్తుకు చేరుకుంది. భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిగాంశంపై సూర్య సమస్థితి కక్ష్యలో 483 కిలోల నోవాసర్ ఎస్, 444 కిలోల ఎస్1-4 ఉపగ్రహాలను విడిచింది. ఇప్పటి వరకు 243 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీని పంపడం 33వసారి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం రాత్రి పీఎస్ఎల్వీ సీ42 ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను పంపించారు. భూమి పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి.
శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 33 గంటల పాటు కొనసాగింది. ఆదివారం రాత్రి గం.10.08 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ సి42 రాకెట్ రూపకల్పనకు రూ.175 కోట్లు వరకు వ్యయం చేశారు. ఇది నాలుగు దశల రాకెట్. దీని పొడవు 44.4 మీటర్లు. ప్రయోగ సమయంలో బరువు 230.4 టన్నులు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications