Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చొరబాటుకు యత్నం: ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిపడేశారు

ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్‌ సెక్టార్‌ల్లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.

కుప్వారా: ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్‌ సెక్టార్‌ల్లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే వారిపై కాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పద ఉల్లంఘనకు పాల్పడిన సమయంలోనే ఈ చొరబాటు యత్నం జరిగింది.

J&K: 2 terrorists shot dead while making infiltration bid

ఇది ఇలా ఉండగా, బీఎస్‌ఎఫ్‌ జవాన్ల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని శనివారం పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ దళాలు కాల్పులు జరిపాయి. ఉదయం 6.45 గంటల సమయంలో కాల్పులు ఆగినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. పాక్‌ కాల్పుల కారణంగా ఒక ఆలయం, రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.

More From
Prev
Next
Read in English: J&K: 2 terrorists shot dead
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+