ఉద్దవ్ థాకరేకు మరో షాక్.. షిండే వర్గంలో చేరిన 66 మంది కార్పొరేటర్లు
శివసేన అధినేత ఉద్దవ్ థాకరే క్రమంగా పార్టీ పట్టు కోల్పోతున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేజారిన సంగతి తెలిసిందే. ఇక మిగిలి ఉంది మిగతా నేతలు, ఇతర పాలక వర్గాలు.. ఆయా చోట్ల కార్పొరేటర్లు. అయితే థానేలో కార్పొరేటర్లు కూడా చేయి జారిపోయారు. ఉద్దవ్ థాకరేకు హ్యాండ్ ఇచ్చి.. సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇదీ థాకరేకు షాక్ కలిగించింది.
మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్లో గల అధికారిక నివాసంలో కలిశారు. వీరు షిండే వర్గంలో చేరినట్టు అయ్యింది. ఇదీ ఉద్దవ్ వర్గానికి పెద్ద షాక్ కలిగించే అంశమే.

షిండే శివసేన పక్ష నేతగా స్పీకర్ నార్వేకర్ గుర్తించారు. గొగవాలేను శివసేన చీఫ్ విప్గా ఎన్నిక చేశారు. అయితే 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ 16 మందిపై అనర్హత వేటు వేసినా.. షిండే ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఆ ప్రభుత్వానికి ఉంది.
గత నెల 20వ తేదీన షిండే తిరుగుబాటు ఎగరవేశారు. రోజు రోజుకు ఆయన మద్దతు పెరిగింది. అలా 39 మందికి చేరింది. చివరి క్షణంలో మరో ఎమ్మెల్యే చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు సభలో మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఉద్దవ్ థాకరేకు ఆదేశాలు జారీచేసింది. దాంతో ఆయన తన సీఎం పదవీకి రాజీనామా చేశారు. ఆ మరునాడు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. షిండేను సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ను డిప్యూటీగా ఎంపిక చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం సజావుగా సాగుతుంది. షిండే బలాన్ని కూడా నిరూపించుకున్నారు. ఇంతలో అతనికి కార్పొరేటర్ల రూపంలో మద్దతు కూడా లభిస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications