ఉక్రెయిన్ నుంచి తక్షణమే వచ్చేయండి, భారతీయులకు పిలుపు
ఉక్రెయిన్లో పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. రష్యా సేనల భీకర దాడి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే అక్కడ ఉన్న వారు స్వదేశం రావాలని భారత రాయబార కార్యాలయం కోరింది. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న.. అక్కడ ఉన్న భారతీయులు వెంటనే స్వదేశం బయలుదేరాలని కోరింది.
ఇప్పటికే యుద్దం మొదలెట్టిన రష్యా.. మరిన్ని దాడులు చేసేందుకు వ్యహారచన చేస్తోంది. అయితే సిచుయేషన్ గమనించినన ప్రపంచ దేశాలు అలర్ట్ చేసింది. ఉక్రెయిన్లో చదువుతున్న వారు కూడా వెంటనే వెళ్లిపోవాలని కోరింది. ఇప్పటికే ఉక్రెయిన్పై రష్యా డజన్ల సంఖ్యలో దాడులు చేసింది. ఇరాన్ దౌత్య సంబంధాలను అధికారికంగా దూరం చేసుకునేందుకు అధ్యక్షుడు జెలెనె స్కీ ప్రతిపాదన చేశారు.
రష్యా సోమవారం జరిపిన దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. పునరుత్పాదక శక్తి కేంద్రాలపు లక్ష్యంగా దాడుల చేశారు. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను తెగ దెంపులు చేసుకుందామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డ్వైమట్రో కులెబా అధ్యక్షుడు జెలెన్ స్కీతో చెప్పారు.రష్యాకు సాయం చేసిన ఇరాన్ పై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ కోరుతుంది.