నోబెల్ అవార్డు గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్..!
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె మద్దతుదారులు, ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించాయి. అనుమానాస్పద రీతిలో మరణించిన ఓ మానవ హక్కుల న్యాయవాది స్మారక చిహ్నం వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నిర్బంధంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా హక్కుల కోసం నర్గెస్ మొహమ్మది మూడు దశాబ్దాలకు పైగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె పలుమార్లు జైలు శిక్షలు అనుభవించారు, ఎన్నో కొరడా దెబ్బలను సైతం ఓర్చుకున్నారు. ఆమె సాగించిన నిస్వార్థ పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆమె ఎంపికైనప్పుడు జైలులో ఉన్నారు.

పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నర్గెస్ మొహమ్మదికి అనారోగ్య కారణాలతో డిసెంబర్ 2024లో కొన్ని వారాలపాటు పెరోల్ మంజూరైంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాల నుంచి ఇరాన్పై తీవ్ర ఒత్తిడి రావడంతో ఈ తాత్కాలిక ఉపశమనం కొనసాగింది. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులపాటు యుద్ధం జరిగిన సమయంలోనూ ఆమె స్వేచ్ఛగానే ఉన్నారు. ఈ కాలంలో నిరసన కార్యక్రమాలలో, అంతర్జాతీయ మీడియా సమావేశాలలో ఆమె చురుకుగా పాల్గొని తన వాదనను వినిపించారు.
-
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications