మా ఎదురుదాడుల్లో 1000 మందికిపైగా రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్ ప్రకటన
కైవ్: గత రెండ్రోజుల నుంచి ఉక్రెయిన్పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుండా ఎదురుదాడిని కొనసాగిస్తోంది. ఓ వైపు భారీ నష్టం జరుగుతున్నా.. రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. కాగా, ఈ ఘర్షణలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
రష్యా దాడులు ప్రారంభించిన నాటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదని పేర్కొంది. గురువారం తెల్లవారుజామున దాడి ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రేనియన్లు, సైనిక సిబ్బంది, పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
అంతకుముందు గురువారం, రష్యా తమ సైన్యం ఉక్రెయిన్లోని 11 ఎయిర్ఫీల్డ్లతో సహా 70కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవు నగరం ఒడెస్సా సమీపంలోని సైనిక స్థావరం వద్ద గురువారం జరిగిన ఘోరమైన ఒకే ఒక్క దాడిలో 18 మంది మరణించారు.
రష్యాతో కొనసాగుతున్న వివాదం మధ్య, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధ వ్యతిరేక సంకీర్ణానికి విజ్ఞప్తి చేశారు. సమర్థవంతమైన అంతర్జాతీయ సహాయం కోసం Zelenskyy పిలుపునిచ్చారు. చర్చల పట్టికలో రష్యాను ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తన పోలిష్ కౌంటర్ ఆండ్రెజ్ డుడాతో ఇదే విషయాన్ని చర్చించినట్లు చెప్పారు. "రక్షణ సహాయం, ఆంక్షలు, దురాక్రమణదారుపై ఒత్తిడి కోసం బుకారెస్ట్ నైన్కు విజ్ఞప్తి చేశారు," అన్నారాయన. ఉక్రెయిన్ అధ్యక్షుడు.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్తో కూడా కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించారు.
"మేము
రష్యన్
ఫెడరేషన్కు
సమర్థవంతమైన
ప్రతిఘటనను
డిమాండ్
చేస్తున్నాము.
ఆంక్షలు
మరింత
బలోపేతం
కావాలి"
అని
మైక్రో
బ్లాగింగ్
ప్లాట్ఫారమ్లో
రాశారు.
కాగా,
ఉక్రెయిన్లో
రష్యా
సైనిక
చర్యను
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న
నాయకులు
ఖండించడమే
కాకుండా,
అధ్యక్షుడు
వ్లాదిమిర్
పుతిన్
దూకుడుకు
వ్యతిరేకంగా
దేశంలో
నిరసనలు
పెరుగుతున్నాయి.