CP Sajjanar: "డబ్బులు ఊరికే రావు.."
నేటి కాలంలో సైబర్ నేరాలకు ఎవరూ అతీతులు కారు. ముఖ్యంగా చదువుకున్న, టెక్నాలజీ గురించి తెలిసిన వారే బాధితులుగా మారుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రోజూ రూ. కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. డబ్బులు ఊరికే రావని.. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు రకాల యాప్స్, ఏపీకే ఫైల్స్ వల్ల కూడా మోసాలు జరుగుతున్నాయని వివరించారు.
సైబర్ క్రైం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసేలోపే నేరగాళ్లు డబ్బులను ఖాతాల నుంచి లాగేసుకుంటారని అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించిందని తెలిపారు. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే వెంటనే హెల్ప్ లైన్ నెంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలికాలంలో చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంటూ అందినకాడికి దోచేస్తున్నారు సైబరాసురులు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఏకంగా రూ.372 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సొమ్ము కూడా కలిపితే అది రూ.976 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే తాజాగా ఇదే విషయంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ప్రతిరోజూ కోట్లాది రూపాయల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. డబుల్, త్రిపుల్ ఇన్ కమ్ వస్తుందని మాయమాటలు చెప్పి ఆన్ లైన్ యాప్స్ ద్వారా డబ్బు లాగేస్తున్నారని తెలిపారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications