మీకు ఇంటర్నెట్ సమస్య ఉండదు.. ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో ప్రజలందరికీ తక్కువ ధరలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి రెడీ అవుతుంది
మారుమూల కుగ్రామాలకు ఇంటర్నెట్ సేవలు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాలలో 9వేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ రింగ్ కనెక్టివిటీ ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లాను, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలను ఈ పరిధిలోకి చేర్చారు. ఈ కనెక్టివిటీ కారణంగా ఇంటర్నెట్ సేవలలో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉంటాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మారుమూల కుగ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

తెలంగాణాలో డిజిటల్ సేవలు అందించటానికి కేంద్రం సహకారం
ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా డిజిటల్ సేవలను అందించడానికి కేంద్రం రాష్ట్రానికి తన వంతుగా సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రింగు కనెక్టివిటీ కి కేంద్రం 432కోట్ల రూపాయలను మంజూరు చేసింది అంతేకాదు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నిర్వహణకు 2697కోట్లతో కలిపి మొత్తం 3185కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది.
తెలంగాణాలో ఆ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్
మరోవైపు టీ ఫైబర్ నాలుగు గ్రామాలలో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ల పైలెట్ ప్రాజెక్టును సక్సెస్ చేసింది. తెలంగాణలో ఈ మోడల్ సక్సెస్ కావడంతో ఇది గుర్తించిన కేంద్రం రింగ్ కనెక్టివిటీ లేని ఇతర జిల్లాలకు ఈ విధానాన్ని వర్తింపచేయడానికి ఆమోదం తెలిపింది. భారత్ నెట్ ఏబిపి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానవాటా ఉండే ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా అనేక కుగ్రామాలలో నెట్ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తోంది.
ఏబీపీని 12769 గ్రామాలలో అమలుకు ఆమోదం తెలిపిన కేంద్రం
కేంద్ర క్యాబినెట్ ఏబీపీని మొత్తం 12769 గ్రామాలలో అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందులో 1946 గ్రామాలలో అప్గ్రేడేషన్ తో పాటు, 36 గ్రామాలలో కొత్త కనెక్టివిటీ అవసరమని పేర్కొంది. ప్రస్తుతం 10,787 గ్రామాలలో రింగ్ కనెక్టివిటీ ఉంది. అయితే ఏబీపీ కింద 2,93,266 కనెక్షన్లకు సెటప్ బాక్స్, ఇతర ఖర్చుల కోసం కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. ప్రతి ఇంటికి కనీసం 25 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగంతో ఇంటర్నెట్, 691 బ్లాకులకు బీఎస్ఎన్ఎల్ లీజ్డ్ లైన్స్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications