కబ్జాదారుల బండారం బయట పెట్టి తీరుతాం.!జైలు నుండి ఎన్ఎస్ యూఐ నేతల విడుదల.!
చర్లపల్లి/హైదరాబాద్ : రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తో సహా 12 మంది ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు కావడంతో వారు విడుదలయ్యారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ముందు మెరుపు ధర్నా నిర్వహించారు ఎన్ఎస్ యూఐ నేతలు. మల్లారెడ్డి హాస్పిటల్ ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ సారథ్యంలో ఎన్ఎస్ యూఐ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అదే రోజు రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించిన నాయకులను బుదవారం బెయిల్ పై విడుదల చేసారు.

ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు.. నిర్ధాక్షిణ్యంగా జైలుకు పంపినందుకు మూల్యం తప్పదన్న వెంకట్..
ఇదిలా ఉండగా 8వ తేదీన మేడ్చల్ మెజిస్ట్రేట్ విచారణ నిర్వహించిన అనంతరం, సెక్షన్ 447, 448, 452 ఐపీసీ మరియు, సెక్షన్ 5 ప్రకారం వైద్యులపై బౌతిక దాడులకు పాల్పడినందుకు, వైద్యకళా శాల వద్ద హింసాత్మక వాతావరణం సృష్టించినందుకు 2018 చట్టం ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ లో ఉన్న నాయకులను విచారణ నిమిత్తం మేజిస్ట్రేట్ ను దుండిగల్ పోలీసులు నిన్న 4 రోజుల కస్టడీ కోరగా వారు బుదవారం ఒక రోజు ఎన్ఎస్ యూఐ నాయకుల తరుపున అడ్వకేట్ సమక్షంలో కస్టడీ నిర్వహణకు అనుమతించడం జరిగింది.

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తప్పుడు కేసులా.. బండారం బహిర్గతం చేస్తానన్న ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఆ తర్వాత ఎన్ఎస్ యూఐ నాయకుల తరుపున అడ్వకేట్ వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూరితో సహా 12 మంది ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎన్ఎస్ యూఐ చేసిన పోరాటంతో మల్లారెడ్డి హాస్పిటల్ వార్త రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారడంతో తన మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యుల బృందంతో సూరారం చౌరస్తా వద్ద 300 పడకలతో ఉచిత కరోనా ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు మినిస్టర్ మల్లారెడ్డి ప్రకటించడం కొసమెరుపు.

ఒకేసారి 13మంది విడుదల.. తప్పుడు కేసులపై కార్యాచరణ ఉంటుందంటున్న ఎన్ఎస్ యూఐ
ఏది ఏమైనా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మరియు అతని బృందం చేసిన పోరాటం వల్ల తమకు ఉచిత ఐసొలేషన్ సెంటర్ వస్తుందని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. బుదవారం ఎన్ఎస్ యూఐ రాష్ట అద్యక్షుడు బలమూరి వెంకట్ తో పాటు 12 మందిని విడుదల చేసారు.
వెంకట్ బలమూరి, రితీష్ రావు రెగులపటి, గొల్ల జాన్, జీవన్ మన్నే, అరుణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పవన్, బిలల్, వినయ్ పటేల్, పృథిరాజ్, దీక్షిత్, గౌతం రావు మరియు రాకేష్ ముదిరాజ్ లు విడుదైలయ్యారు.
Recommended Video

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీ సర్కార్.. మండిపడ్డ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు తరలించారని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ బలమూరి మండిపడ్డారు. కరోనా నియమాలను పాటిస్తూ నిరసన తెలిపిన తమ పై తప్పుడు కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వెంకట్ స్పష్టం చేసారు. తాను ఒక ఎంబీబీఎస్ విద్యార్థిననీ, అంతే కాకుండా తనతో ఉన్న వారందరూ విద్యార్థులని కూడా చూడకుండా మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లపై దాడి చేశామని అక్రమంగా కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైలుకు తరలించారని, కేసులో ఉన్న లోపాలను అదే విధంగా దీని వెనక ఉన్న నాయకుల అక్రమ చిట్టాలను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేస్తానని వెంకట్ తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications