కూతురిపై మారుతీరావుకి ఎంత పగో .. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రణయ్ హత్య చార్జ్ షీట్ !
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు 1600 పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు. ఇక ఈ చార్జిషీట్లో పలు ఆసక్తికరమైన అంశాలను పేర్కొన్నారు పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్న మారుతీ రావు కూతురు అమృత వర్షిణి పైన మారుతీ రావు ఎంతగా పగ పెంచుకున్నాడు అనేది పోలీసులు ఈ చార్జిషీట్లో పేర్కొన్న విషయాలను బట్టి అర్ధం అవుతుంది .

కుమార్తెకు చిల్లి గవ్వ కూడా ఆస్థి దక్కకుండా ప్లాన్ .. కులాంతర వివాహమే కారణం
చార్జిషీట్లో పేర్కొన్న అంశాలను బట్టి కులాంతర వివాహం చేసుకుని తన పరువు తీసిన కోపంతో కుమార్తె అమృత వర్షిణికి తన ఆస్థిలో చిల్లి గవ్వ కూడా దక్కకూడదని మారుతీరావు నిర్ణయం తీసుకున్నాడు. ఆ మేరకు అమృత కు తన ఆస్థి ఏమీ చెందకుండా ఉండేలా వీలునామా కూడా రాశారని పోలీసులు ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయం తీసుకున్న మారుతీరావు ప్రణయ్ హత్య కోసం కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్లుగా ఛార్జీషీట్ లో పేర్కొన్నారు.

ప్రణయ్ ను చంపాలన్న పగ .. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి బీహారీతో హత్య
ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కూతురు కులాంతర వివాహం చేసుకోవడమే తన పరువు పోవడానికి కారణం అని భావించిన మారుతీ రావు కూతురు పైన, అదేవిధంగా ప్రణయ్ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. ఇక వారి వివాహానికి సంబంధించిన రిసెప్షన్ వీడియోలను సోషల్ మీడియా లో చూసిన మారుతీ రావు అమృత పై, ప్రణయ్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని అందుకోసం కిరాయి హంతకులను సైతం మాట్లాడుకుని ప్రణయ్ ను హతమార్చారని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. ఇక ప్రణయ్ హత్యకు మాజీ ఐ.ఎస్.ఐ ఉగ్రవాదులతో మారుతీ రావు కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తుంది. ఇక మొదట ప్రణయ్ ను చంపటానికి మిర్యాలగూడలోని స్థానికంగా ఉన్న కిరాయి ముఠాలతో సంప్రదించాలీ అనుకున్న మారుతీ రావు, పక్కా ప్రొఫెషనల్ కావాలని డిసైడ్ అయ్యారు.

పక్కా స్కెచ్ గీసిన మారుతీరావు ... కూతురు గర్భిణీ అని కూడా చూడకుండా ప్రణయ్ హత్య
అందులో భాగంగా నల్గొండ లోని ఐఎస్ఐ మాజీ ఉగ్రవాదులు బారీ, అస్గర్ ఆలీలను సంప్రదించాడు. ఇక వారికి రాజమండ్రి జైల్లో కలిసిన బిహార్ వాసి సుభాష్ శర్మ అయితే పక్కాగా మిస్ కాకుండా మర్డర్ చేస్తారని భావించి దీంతో కరీంను పిలిచి హత్యకు ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. బీహార్ నుంచి సుభాష్ శర్మ ను రప్పించి కరీం ఇంట్లో ఉంచాడు. 45 రోజుల పాటు మకాం వేసిన సుభాష్ శర్మ ప్రణయ్ హత్య కోసం రెక్కీ నిర్వహించి రెండుసార్లు హత్యా యత్నం చేయగా అది విఫలమైంది. ఇక మూడో సారి గర్భిణీ అయిన అమృతను ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ప్రణయ్ పై దాడి చేసి విచక్షణ రహితంగా నరికి హత్య గావించారు. ఇక సుభాష్ శర్మ హత్య చేస్తున్న సమయంలో బారీ, అస్గర్ అలీలు దగ్గరలోనే ఉండి పర్యవేక్షించారు .

కూతురి జీవితం నాశనం చేసిన కసాయి తండ్రి .. కూతురిపై కక్ష సాధింపు
మారుతీ రావు కుమార్తె పై పెంచుకున్న కక్ష , ప్రణయ్ ను చంపటానికి వేసిన ప్లాన్స్ అన్నీ చార్జ్ షీట్ లో పేర్కొని కూతురి విషయంలో ఇంత కసాయిలా ప్రవర్తించిన తండ్రి మారుతీరావు ఏం చేశారో పూర్తి ఆధారాలు సమర్పిస్తున్నామని 1600 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు . మొత్తం 120 మందిని విచారించిన పోలీసులు హత్యలో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత సెప్టెంబరు 14న జరిగిన ప్రణయ్ హత్య కేసును తొమ్మిది నెలలపాటు విచారించిన తర్వాత బుధవారం చార్జిషీట్ దాఖలు చేశారు.
ఇక పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ అమృత పట్ల తండ్రి మారుతీరావు పెంచుకున్న పగను తెలియజేస్తుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications