విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణం

|
Google Oneindia TeluguNews

ఓ పెళ్లి సంబంధం అన్నదమ్ముల మధ్య గొడవకి కారణం అవడమే కాదు, ఏకంగా తమ్ముడిని అన్న హత్య చేసేదాకా తీసుకు వచ్చింది. కొడుకుకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులకు ఒక కొడుకు మరణం, మరో కొడుకు హంతకుడిగా మారడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగిక దాడి..ఆపై నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్..ఏపీలో దారుణంఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగిక దాడి..ఆపై నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్..ఏపీలో దారుణం

 ఇంతకీ ఏం జరిగిందంటే

ఇంతకీ ఏం జరిగిందంటే

అన్నను పెళ్లి చూపులు చూసి తమ్ముడ్ని చేసుకుంటా అన్న అమ్మాయి .. ఓకే చెప్పిన పెద్దలు

అచ్యుతాపురం మండలం జాలరి పాలెం కు చెందిన మడ్డు పోలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు రాజు . చిన్న కొడుకు పేరు యర్లయ్య. రాజు కి పెళ్లి చేయడానికి భీమిలి కి చెందిన అమ్మాయి ని చూశారు. అయితే ఆ అమ్మాయి పోలమ్మ పెద్దకుమారుడు రాజును కాకుండా, చిన్న కుమారుడు ఎర్లయ్య ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది . దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు వేరే సంబంధం చూస్తానని నచ్చజెప్పింది .

తనను కాదన్న అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని అన్న ఘాతుకం

తనను కాదన్న అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని అన్న ఘాతుకం

ఇక మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. తనకు చూసిన సంబంధం తనకు కాకుండా తమ్ముడికి చేయడాన్ని రాజు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర అసహనానికి గురయ్యాడు.

సోమవారం రోజు ఎర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులు అడిగాడు. ఆమె రెండు వేల రూపాయలు ఇవ్వగా, అవి సరిపోవని 4000 రూపాయలు కావాలంటూ తల్లి తో గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కడే ఉన్న రాజు తల్లితో గొడవ పడుతున్న యర్లయ్యను అడ్డుకుని పక్కన ఉన్న కత్తిని అమాంతం తమ్ముడు గొంతులో దించాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాజు పరారయ్యాడు.

తమ్ముడ్ని చంపి పరారైన అన్న .. పెళ్లి కోసమే చేశానని పోలీసుల ముందు అంగీకారం

తమ్ముడ్ని చంపి పరారైన అన్న .. పెళ్లి కోసమే చేశానని పోలీసుల ముందు అంగీకారం


యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించాడు . పరారైన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టారు. తనను కాదన్న అమ్మాయిని తన తమ్ముడి పెళ్లి చేసుకోవటం రాజుకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయినా తమ్ముడు తనను కాదని చెప్పిన అమ్మాయినే చేసుకుంటున్నందుకు తమ్ముడును చంపానని పోలీసులకు చెప్పాడు .

పెద్దోడి పెళ్లి చిన్నోడి చావుకు కారణం అయిందని ఆవేదనలో తల్లిదండ్రులు

పెద్దోడి పెళ్లి చిన్నోడి చావుకు కారణం అయిందని ఆవేదనలో తల్లిదండ్రులు

కేసు నమోదు చేసిన పోలీసులు యర్లయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు . అరెస్ట్ చేసిన నిందితుడిని రిమాండ్ కు పంపించారు. కుటుంబంలో జరిగే చిన్న చిన్న వివాదాలకు అన్నదమ్ములు శత్రువులు గా మారుతున్న నేటి రోజులలో పెళ్లి కోసం జరిగిన ఈ సంఘటన అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. పెద్దోడి పెళ్ళి చేయాలనుకున్న తల్లిదండ్రులకు చిన్నోడి చావును చూడాల్సి వచ్చింది .

English summary
Maddu Polamma of Achuthapuram Mandal Jalari Palam has two sons. The eldest son's name is raju. The youngest son's name is Yarlaiah. Raju saw a girl from Bhimili to marry . However, the girl says to Polamma will marry her youngest son, Erlaiah, instead of her eldest son, Raju. With this, Polamma confirmed the match to Yarlaiah. With this raju stabbed his younger brother, who did not want to marry a girl who rejected him .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X