Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సబితా ఇంద్రారెడ్డికి 'సన్' స్ట్రోక్

Sabitha Indra Reddy
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలిసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నిజానికి, సబితా ఇంద్రారెడ్డి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. కానీ కుమారుడి కారణంగా ఆమె వివాదాల్లో ఇరుక్కున్నారు. హోం మంత్రి కార్యాలయం పేరు చెప్పుకుని డబ్బులు గుంజినట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవలి కాలంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడి కార్తిక్ రెడ్డి పేరు ప్రముఖంగా ముందుకు వస్తోంది. విజయవాడలోని భారీ సెటిల్మెంట్ వ్యవహారంలో కార్తిక్ రెడ్డి పేరు ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఆ తర్వాత మద్దెలచెర్వు సూరి హత్య ఉదంతంలో మరోసారి ముందుకు వచ్చింది. దీంతో తొలిసారి సబితా ఇంద్రారెడ్డి దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒక్కరొక్కరే హత్యకు గురి కావడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు ఒకరి వెంట ఒకరు వరుసగా హత్యకు గురికావడానికి వెనుక ఉన్న గాడ్ ఫాదర్ ఎవరో తేలాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సీరియల్ హత్యల వెనుక ఉన్న గాడ్ ఫాదర్, జూనియర్ గాడ్ ఫాదర్ ఎవరో తేల్చడానికి న్యాయ విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర హోం మంత్రి నివాసం నుంచే క్రిమినల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని బైరెడ్డి ఆరోపించారు. 'సూరి పక్కన తిరుగుతున్న భాను, మధుసూధన్ ‌కు హోం మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని ప్రసార సాధనాల్లో అనేక కధనాలు వస్తున్నాయి. విజయవాడ సెటిల్మెంటు వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రదీప్ ‌రెడ్డికి, కార్తీక్ ‌రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు కూడా తేలాలి. ఈ క్రిమినల్ గ్యాంగుల కార్యకలాపాలన్నింటికి హోం మంత్రి నివాసమే కేంద్రంగా మారింది' అని ఆయన అన్నారు. హోం మంత్రి కుమారుడు చేసే సెటిల్మెంట్ల వ్యవహారాల్లో ఏ పార్టీ వారికి సంబంధాలు ఉన్నా వారందరిపైనా చర్య తీసుకోవాల్సిందేనని, ముందుగా హోం మంత్రిని ఆ పదవి నుంచి తప్పించడం ద్వారా ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సూరి హత్యతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి లింక్ పెట్టడాన్ని డిజిపి అరవింద రావు ఖండించారు. అయినా అగ్గి చల్లారలేదు. మీడియా చానెళ్లు అన్నీ సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. సూరిని హత్య చేశాడని భావిస్తున్న భాను కిరణ్, మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి గ్యాంగ్‌కు కార్తిక్ రెడ్డి అండదండలున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీతో స్వయంగా సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సూరి హత్యతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. 'రాజకీయంగా తనను కలవటానికి చాలామంది వస్తుంటారు. అపుడు ఇంట్లోనే ఉండే నా కుమారుడిని కూడా కలుస్తూ ఉండవవచ్చు. అంతమాత్రాన మమ్నల్ని హత్య కేసులోకి లాగటం ఎంతవరకు సబబు?' అని ఆమె ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+