తెలంగాణలో చక్రం: పార్టీ బాధ్యతలు షర్మిలకు?

అయినప్పటికీ తెలంగాణలో తమ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నా, సీమాంధ్రతో పాటు తెలంగాణలోను పార్టీ హవా కొనసాగాలన్నా తెలంగాణ ప్రాంతంలో పార్టీ బాధ్యతలు ముఖ్యమైన వారు ఎవరైనా తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఉంటే ఆమెకే బాధ్యతలు అప్పగించే అవకాశముండేది. ఆమె ఎప్పుడో పార్టీని వీడారు.
ఇప్పుడు విభజన అనంతరం తెలంగాణలోను క్యాడర్ను కాపాడుకోవాల్సి ఉంది. దీంతో తెలంగాణలో బాధ్యతను షర్మిలకు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో తమ పార్టీ ప్రభావం ఇప్పుడు అంతగా లేకపోయినా భవిష్యత్తులో బాగుంటుందని భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో క్యాడర్ కోసం షర్మిలను రంగంలోకి దింపే అవకాశాలున్నాయంటున్నారు. జగన్ సీమాంధ్రను చూసుకొని, తెలంగాణలో సోదరికి బాధ్యతలు అప్పగిస్తారంటున్నారు. ఎన్నికల్లో షర్మిలనే తెలంగాణలో ప్రచారం చేసే అవకాశముంటుందంటున్నారు. అయితే, రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో జగనే నాయకత్వం వహిస్తారని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications