రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా: ఐదుగురు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం శ్రీమంతగూడెం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఆదివారంనాడు ఐదుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఇబ్రాహింపట్నం ఆస్పత్రికి తరిలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అందరూ కూలీలే.
సిమెంటు లోడుతో వెళ్తున్న ట్రాక్టరులో 15 మంది ప్రయాణిస్తున్నారు. అది అదుపు తప్పి బోల్తా పడింది. ఓవరు లోడే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications