వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర సంపన్నుల కుట్ర: కర్నాటి

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: సంపన్నవర్గాలకు చెందిన రాజకీయ నాయకుల ఉచ్చులో పడి విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని జై ఆంధ్ర ఉద్యమకర్త కర్నాటి రామ్మోహనరావు హితవు పలికారు. సూర్యారావుపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1953లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడుతున్నప్పుడు రాయలసీమ నాయకులు తాము తమిళులతోనైనా కలిసి ఉంటాం కానీ సర్కారు జిల్లాల ఆంధ్రులతో కలవమన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే కోస్తా జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలపై ఏనాడూ రాజీనామాలు చేయని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర అంటూ రాజీనామాలు చేస్తున్నారన్నారు. హైకోర్టు బెంచి విజయవాడలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు 133 రోజులు ఆందోళన చేస్తే లగడపాటి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రోశయ్య నాయకత్వాన్ని ఆమోదించలేని శక్తులే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టారని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X