సురేంద్రపై వనమా వర్గం దాడి, పరిస్థితి విషమం: చిరు పరామర్శ
పరామర్శించడానికి వచ్చిన సురేంద్రపై వనమా వర్గీయులు దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా బాదారు. దీంతో సురేంద్ర అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను కొందరు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సురేంద్రపై దాడి జరిగిన తర్వాత వనమా తన దీక్షను అర్ధాంతరంగా ముగించికొని వెళ్లిపోయారు. సురేంద్రపై చిలుకా రవి, ఆయన వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి నిరసనగా కొత్తగూడెం జెఏసి నగరం బంద్కు పిలుపునిచ్చింది.
కాగా సురేంద్రపై దాడికి నిరసనగా ఆయన వర్గం కొత్తగూడెం త్రీటౌన్ సెంటర్లో ధర్నాకు దిగింది. సురేంద్రపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన గ్రామం టేకులపల్లి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వారిని కొత్తగూడెం శివారులోనే అడ్డుకున్నారు. సురేంద్రపై దాడిని హోంమంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఆయన వర్గం చెబుతోంది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా చిరంజీవి దాడిలో గాయపడ్డ సురేంద్ర కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.