తెలంగాణ ఎలా వస్తుంది, జగనొస్తారు: కెసిఆర్కు సురేఖ
దీనిపై సెప్టెంబర్ 15 నుంచి ఉద్యమించనున్నట్లు చెప్పారు. పరకాల ఉపఎన్నికలో 44 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లలో ఒక్క ఓటు కూడా తెరాసకు పడలేదన్నారు. సిరిసిల్లలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇటీవల చేపట్టిన దీక్షను ప్రజలు అడ్డుకోలేదని, కేవలం తెరాస కార్యకర్తలను ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టడం వల్లే అడ్డుకునే యత్నం చేశారన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసుల్లో నుంచి ఆయనను తుడిచి వేసేందుకు కుయుక్తులు పన్నుతోందని సురేఖ విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే పనిలో తలమునకలై ఉన్నాయనీ వ్యాఖ్యానించారు.
జగన్ నిర్దోషిగా త్వరలో బయటకొస్తారన్నారు. జగన్ అక్రమంగా కేసులలో ఇరికించి జైలుకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ వైయస్సార్ కాంగ్రెసు అన్ని స్థానాలలో విజయం సాధిస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.