ఒకరిద్దరూ రాజీనామాలు కాదు, అసెంబ్లీని రద్దు చేయండి, సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
సీపీఐ నారాయణ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతం వారు మాత్రమే నిరసనబాట పట్టారని గుర్తుచేశారు.
రైతుల పాదయాత్రపై మంత్రులు కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సివిల్ వార్ సృష్టించి అరాచకం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ మేనిఫెస్టోలో మూడు రాజధానులు అని ఎక్కడా అనలేదని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒకరిద్దరు రాజీనామా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కావాలంటే అసెంబ్లీని రద్దు చేయాలని సూచించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సీపీఐ నారాయణ సవాల్ విసిరారు. అప్పుడు జనం ఎవరికీ సపోర్ట్ చేస్తారో తెలియనుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కావాలని జనమే అడుగుతున్నారని గుర్తుచేశారు. ఇందులో మరో మాటకు తావులేదని చెప్పారు.
సీపీఐ నారాయణ బర్నింగ్ ఇష్యూపై స్పందిస్తుంటారు. అమరావతి రాజధాని గురించి రెగ్యులర్ గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడు రాజధానుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడంతో నారాయణ స్పందించారు. అలా కాదని.. అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications