చంద్రబాబు- మిట్టల్ భేటీ..! అనకాపల్లిలో ముహుర్తం ఫిక్స్..!
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. అక్కడ స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ పారిశ్రామిక వేత్తలతో జరుగుతున్న భేటీలో భాగంగా మిట్టల్ తోనూ సమావేశమై పలు అంశాలు చర్చించారు. ఇందులో భాగంగా వీరిద్దరూ కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలోని అనకాపల్లికి మంచి రోజులు రాబోతున్నాయి.
అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయి అనకాపల్లిలో నిర్మించనున్న భారీ స్టీల్ ప్లాంట్ పై చర్చించారు. దావోస్ లోని ఏపీ లాంజ్ లో జరిగిన ఈ భేటీలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్ధ సీఈవో ఆదిత్య మిట్టల్, మంత్రులు లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై వీరు చర్చించారు. తొలి దశలోనే దాదాపు రూ. 60వేల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వివిధ దశల్లో ఉన్న అనుమతులపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలో అధికారులతో సీఎం సమీక్షించారు.
అనంతరం ఫిబ్రవరి 15లోగా అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 15 తరవాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, ఇతర సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని స్పష్టం చేశారు.

అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అవసరమైన అన్ని అనుమతుల సాధించాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్ లకు సీఎం సూచన చేశారు. ప్లాంట్ నిర్మాణం విషయంలో మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు గురించి లక్ష్మీ మిట్టల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications