అట్టారీ-వాఘా బోర్డర్‌లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలు

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారత్ మాతాకీ జై...జై జవాన్.. అనే నినాదాలు మారుమోగాయి. సైనికులను ప్రజలు ఉత్సాహపరిచారు. స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తారు.

బీటింగ్ రీట్రీట్ ఆనవాయితీ 17వ శతాబ్దంలో ఇంగ్లాండులో మొదలైంది. అప్పటి కింగ్ జేమ్స్ II ఆదేశాల మేరకు దీన్ని నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని 'వాచ్ సెట్టింగ్'గా పిలిచేవారు. సూర్యాస్తమయ సమయంలో తుపాకీతో సింగిల్ రౌండ్ కాల్పులతో దీన్ని ప్రారంభించేవారు. ప్రస్తుతం యూకె,యూఎస్,కెనడా,న్యూజిలాండ్,భారత్ లాంటి దేశాల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

Beating Retreat ceremony at Attari-Wagah border on Republic day

భారత రక్షణ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. రక్షణ శాఖలోని సెక్షన్ డి డిపార్ట్‌మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో సైనిక విన్యాసాలతో పాటు మ్యూజికల్ పెర్ఫామెన్స్ కూడా ఉంటుంది. ఇండియన్,వెస్టర్న్ సంగీతాన్ని ఆలపిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+