వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కీలక నిర్ణయం: జమ్మూ కశ్మీర్ నుంచి.. 10 వేల మంది శరణార్థ ముస్లింలు వెనక్కి

శరణార్థులుగా కాలం గడుపుతున్న 10 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్ కు పంపించివేయాలని మోడీ సర్కారు నిర్ణయా తీసుకోనుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లో ఎంతో కాలంగా శరణార్థులుగా కాలం గడుపుతున్న 10 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్ కు పంపించివేయాలని మోడీ సర్కారు నిర్ణయా తీసుకోనుంది. జమ్మూ కశ్మీర్ లెక్కల ప్రకారం... సుమారు 10 వేల మంది రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్నారు. ఇక దేశ వ్యాప్తంగా వీరి సంఖ్యం 40 వేల వరకు ఉండొచ్చని అంచనా.

సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తించి, దేశం నుంచి పంపించి వేసేందుకు అవసరమై చర్యల దిశగా ఉపక్రమించాలంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దశాబ్దాల నాడు మయన్మార్ నుంచి మన దేశంలోకి వచి్చన రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు జమ్మూ, సాంబా జిల్లాల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

Centre exploring ways to deport 40,000 Rohingya Muslims

వీరంతా చట్ట వ్యతిరేకంగా భారత్-బంగ్లాదేశ్, భారత్-మయన్మార్ సరిహద్దులు దాటడం ద్వారా.. లేదంటే బంగాళాఖాతం మీదుగా ప్రయాణం చేసి భారత్ లోకి ప్రవేశించిన వారు. వీరిని తిరిగి పంపించివేసే దిశగా.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రటరీ బ్రజ్ రాజ్ శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వెయిద్ ల నడుమ కీలక చర్చలు జరిగాయి.

రోహింగ్యా ముస్లింలను ఎలా గుర్తించాలన్నదే పెద్ద సమస్య. దీనికీ మార్గాన్వేషణ జరుగుతోందని హోం శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. వీరిలో కొంతమంది ఐరాస శరణార్థ సంఘంలో రిజిస్టర్ చేసుకున్నా, వీరిని గుర్తించేందుకు భారత్ నిరాకరిస్తూ వస్తోంది.

English summary
Delhi: The issue of Rohingya Muslims was discussed at a meeting convened by union home secretary Rajiv Mehrishi and attended by J&K chief secretary and DGP. More than 40,000 Rohingya Muslims belonging to Myanmar are currently living in Jammu and Kashmir, and the central and the state governments are exploring ways on how to identify and deport them.The Rohingya Muslims are mostly living in Jammu and Samba districts and came to the state after entering India illegally through either Indo-Bangladesh border or Indo-Myanmar border or travelling through the Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X