జియో శుభవార్త: తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో మరో సంచలనానికి రెఢీ అవుతోంది. తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి రిలయన్స్ జియో ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్
రిలయన్స్ జియో సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తోంది.ఉచిత వాయిస్కాల్స్, ఉచిత డేటాలతో మార్కెట్లోకి ప్రవేశించి సంచలనాలను సృష్టించింది.
జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్పై 70% క్యాష్బ్యాక్
జియో తీరుతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు కూడ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
జియో షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలు
అంతేకాదు ప్రత్యర్థులను చిత్తు చేసేందుకుగాను రిలయన్స్ జియో వినూత్న ఆలోచనలతో ముందుకువస్తోంది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ జియోకు చెక్ పెట్టేందుకుగాను కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో
చౌకగా జియో 4జీ స్మార్ట్ఫోన్
స్మార్ట్ఫోన్ మార్కెట్పై రిలయన్స్ జియో కేంద్రీకరించింది. ఫీచర్ ఫోన్ మాదిరి తరహలోనే 4జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేయాలని జియో యోచిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన చిప్ తయారీ కంపెనీ స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్ కంపెనీతో చర్చలు జరిపింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ లియో లి ధృవీకరించారు. రిలయన్స్ జియో అందించే 4జీ హ్యాండ్సెట్కు పరికరాలను సరఫరాల చేయడం కోసం జియో స్ప్రెడ్ట్రమ్తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే జియో ఫీచర్ఫోన్కు పరికరాలను ఈ కంపెనీయే సరఫరా చేస్తోంది.
ఈ ఏదాది చివర్లో మార్కెట్లోకి జియో 4జీ
ఈ ఏడాది చివరినాటికి షాంఘైకి చెందిన తమ కంపెనీ జియోకు 10 మిలియన్ 4జీ ఫీచర్ ఫోన్లకు చిప్స్ను సరఫరా చేయనుందని లియో లి తెలిపారు. ఈ చిప్స్ అందిన తర్వాత పోన్లను మార్కెట్లోకి విడుదల చేయాలని రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది.
4 అంగుళాల స్క్రీన్
అతి తక్కువ ధరలో జియో తీసుకొస్తున్న స్మార్ట్ఫోన్ 4 అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంటుందని లి తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఇంకా జియో ధృవీకరించలేదు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్ అని లి తెలిపారు. తాము జియోతో కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.తక్కువ ధరకే 4జీ ఫీచర్ఫోన్లను అందిస్తున్నట్టు లి చెప్పారు.
10 మిలియన్ డివైజ్ల విక్రయం
ఈ ఏడాది చివరి నాటికి 10 మిలియన్ డివైజ్లను విక్రయించాలని జియో ప్లాన్ చేస్తోంది.రిలయన్స్ రిటైల్లో మూడేళ్ల డిపాజిట్ కింద రూ.1500 కట్టి ఈ డివైజ్ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. తాజాగా జియో అత్యంత చౌకగా స్మార్ట్ఫోన్ను కూడా అందించబోతున్నట్టు స్ప్రెడ్ట్రమ్ పేర్కొంది. మరోవైపు స్థానిక హ్యాండ్సెట్ తయారీదారులతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని స్ప్రెడ్ట్రమ్ చూస్తోంది.