వెదర్ రిపోర్ట్: ఈశ్యాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీలోనూ..
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఒడిశా, గ్యాంగ్టక్ పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని పలు ప్రాంతాలు, మేఘాలయ, సిక్కింలలో ప్రవేశించాయి. రాగల 24గంటల్లో మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
భారత వాతావణ శా బుధవారం విడుదల చేసిన అంచనాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఒడిశా, గ్యాంగ్టక్ పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని పలు ప్రాంతాలు, మేఘాలయ, సిక్కింలతోపాటు థానే(ముంబై), అహ్మద్ నగర్, బుల్ధానా, అమ్రోటి, గోండియా, తిట్లాగఢ్, కటక్, మిడ్నాపూర్, గోవాల్పార, బాగ్డోగ్రా, ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే వారం వరకు ఈ రుతుపవనాలు ప్రభావం బలహీనంగా ఉంది.
తీరప్రాంతాలు, దక్షిణ కర్ణాటక, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, దక్షిణ కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
గోవా-కర్ణాటక-కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతం కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. సోమాలియా, ఒమన్ ఆరేబియా సముద్ర తీరప్రాంతాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉంది.