వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరో షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో-39 తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపిటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మంగళవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో-39ను తీసుకొచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. జీవో 39తో రెవెన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.

High court on GO 39

వాదనలు విన్న హైకోర్టు.. రైతు సమితులకు విడుదల చేసిన రూ. 500కోట్లను ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ. 500కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ స్పష్టం చేసింది.

English summary
High court given shocks to Telangana government on GO 39.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X