ఆసక్తికరం: 'దొరల పాలనొద్దు టిడిపిలోకి రండి', 'ఎన్టీఆర్ కూడ దొరే'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ల మధ్య మంగళవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మధ్య ఆసక్తిర చర్చ సాగింది. టీఆర్ఎస్లోకి రావాలంటూ సండ్ర వెంకటవీరయ్యను, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు ఆహ్వానించారు. ఇందుకు సండ్ర బదులిస్తూ.. " మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు" అని ఆయన అన్నారు. కెసిఆర్ దొర అయినా... బడుగుల కోసం పనిచేస్తున్నారని బాలరాజు చెప్పారు.

బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర చెప్పగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు చెప్పారు. ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవని బాలరాజుకు ధీటుగా సండ్ర సమాధానమిచ్చారు. బడుగుల గురించి ఎన్టీఆర్ కన్నా సీఎం కేసీఆర్ బాగా ఆలోచన చేస్తున్నారని సండ్రతో ఎమ్మెల్యే బాలరాజు చెప్పుకొచ్చారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications