పార్కింగ్ ఘర్షణ: నెక్లెస్రోడ్డులో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పీపుల్స్ ప్లాజా పార్కింగ్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిపై గతంలో పంజగుట్ట పీఎస్లో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే, కొందరు దుండగులు యువకుడి గొంతు కోసి హత్య చేసినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతిచెందిన వ్యక్తిని తాఖి అలీగా గుర్తించారు. క్లూస్ టీం సిబ్బంది ఘటనాస్థలంలో దర్యాప్తు చేపట్టింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భువనగిరి మండలం బస్వాపురంలో నవీన్ అనే యువకుడిపై కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రగాయాలైన యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications