వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్య తరగతి ప్రజలకు తగిన ధరల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Skyworth
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ స్కైవర్త్- ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టెలివిజన్ సెట్లు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లోనే ఈ ఉత్పత్తుల శ్రేణిని కంపెనీ ఆవిష్కరించింది. స్కైవర్త్ (ఇండియా) ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ మైకేల్‌క్యుయాంగ్ ఉత్పత్తుల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, మధ్య తరగతి ప్రజలకు కూడా తగిన ధరల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టెలివిజన్ సెట్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ నాటికి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఉత్పత్తుల విక్రయాలను విస్తరించాలన్న ప్రణాళిక ఉందన్నారు. స్కైవర్త్ ఉత్పత్తుల శ్రేణిలో సీఆర్‌టీ టీవీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, 3డీ ఎల్‌ఈడీ, ఆండ్రాయిడ్ 3డీ ఎల్‌ఈడీ రకాలు 19-55 అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభ్యం అవుతున్నాయి. వీటి ధరలు రూ.13,990-1,37,990 శ్రేణిలో ఉన్నాయి. కాగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు వంటి ఇతర కంపెనీ ప్రొడక్టులనూ త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి స్కైవర్త్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ కంట్రీ హెడ్(సేల్స్) సామ్యూల్ మనోహర్ చెప్పారు.

English summary
Skyworth, the $4-billion diversified Hong Kong stock exchange-listed electronics and white goods company and a leading brand in China, on Saturday announced the roll-out of a wide range of LCD and LED TVs in the Indian market beginning Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X