వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా దారిలోకి రండి: జగన్ వర్గానికి ద్వారంపూడి సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

dwarampudi chandrasekhar reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులకు కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురువారం సూచనలు చేశారు. ఇప్పటికైనా తమ బాటలోకి వస్తే మేలని ద్వారంపూడి అసెంబ్లీ లాబీల్లో కలిసిన జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో అన్నారు. లాబీల్లో ఇరువురు పరస్పరం ఎదురు పడినప్పుడు గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తాము చేయాల్సిందంతా చేశామని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని, తప్పంతా మీదేనని రాజీనామా, వేటు అంశంపై ద్వారంపూడితో అన్నారు. అందుకు ద్వారంపూడి తమ దారిలోకి రావాలని సూచించారు. దానికి గుర్నాథ్ రెడ్డి అంత శక్తి మాకు లేదని స్పష్టం చేశారు.

కాగా అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి.. కాంగ్రెసులో ఉన్న వారు ఉత్త భద్రులేనని వీరభద్రులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. వీరభద్రులంటే కత్తి చేతిలో పట్టుకొని ఉండేవారని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా ఆమోదించారని, ఇక్కడ కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వారంలో వేటు పడవచ్చునని అభిప్రాయపడ్డారు.

English summary
Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy suggested Jagan camp MLA Gurnath Reddy to follow them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X