దాడి చేస్తే తల పగులగొట్టండి: మహిళలకు నారాయణ
ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో నారాయణ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టేందుకు ప్రత్యక్ష ఆందోళనలు సాగించాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును రక్షించడానికి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెంట్ కృషి చేస్తోందన్నారు. నేతి బీరలో నెయ్యి ఎంతుంటుందో, ధర్మానలో ధర్మం అంతే ఉంటుందని ఎద్దేవా చేశారు.
హిజ్రాలకు పింఛన్లు
రాష్ట్రంలో సుమారు 24 లక్షల మంది హిజ్రాలు అవమానభారంతో బతుకుతున్నారని, వారిని మానవా దృక్పథంతో అదుకోవాలని నారాయణ వేరుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు హిజ్రాల హక్కుల గురించి ఆందోళనలు చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని హిజ్రాల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తమిళనాడులో హిజ్రాల సంక్షేమ మండలి ఏర్పాటు చేసి నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ చెల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా హిజ్రాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ చెల్లించాలని కోరారు. ఎవరూ ఉద్యోగాలు ఇవ్వని కారణంగా వారు బిక్షమెత్తుకుని కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల దరఖాస్తుల్లో వీరి కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ కేటాయించాలని సూచించారు.