సిబిఐ మాత్రమే కాదు.. స్పీకర్ కూడా: జగన్ పార్టీ నేత
తమ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాల్సిందిగా అప్పుడే కోరినా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం శాసన సభ్యత్వాన్ని పోగొట్టుకోవడం గౌరవంతో కూడిన విషయమన్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతిస్తుందని మైసూరా రెడ్డి వేరుగా చెప్పారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసానికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు వారే స్వయంగా విప్ ధిక్కరించామని తమపై అనర్హత వేటు వేయాలని రాతపూర్వకంగా కోరినా స్పీకర్ ఏ నిర్ణయం త్వరగా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ముందుగా నిర్వహిస్తోందని ఆయన విమర్శించింది.
ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిచడం ఆనవాయితీ అన్నారు. అయినా.. ప్రతిపక్షం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. ఎన్నికలు ఎలా జరిపినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, 80శాతం స్థానాలను కైవసం చేసుకొంటుందని ధీమా వ్యక్తం చేశారు.