సంక్రాంతికి బిచ్చగాడు.. చంద్రబాబుపై కొడాలి నానీ సెటైర్లు
Recommended Video
ఏపీలో రాజధాని విషయంలో రగడ కొనసాగుతుంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన విషయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు సైతం అమరావతి పరిరక్షణా సమితి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మద్దతు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జోలె పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిపై ఆయన సెటైర్లు వేశారు.
రాజకీయ పబ్బం గడుపు కోవడానికి చంద్రబాబు వేషాలు ..నానీ ఫైర్
సంక్రాంతికి బిచ్చగాని గెటప్ వేసిన చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నాని మండిపడ్డారు . సోమవారం జరిగిన హైపవర్ కమిటీ సమావేశం తర్వాత కొడాలి నాని చంద్రబాబు, లోకేశ్లపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి అడుక్కున్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు అలా మారిపోయారని నానీ వ్యాఖ్యానించారు . చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయారని ఎద్దేవా
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు కొడాలి నానీ . గతంలో తమ ప్రభుత్వ హయాంలో తాను చేసిన పాపాలకు అడుక్కునే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన వసరం ఉందని చెప్పిన కొడాలి నానీ చంద్రబాబు ఏం చేసినా జగన్ నిర్ణయం మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు.
రాజధాని అల్లర్లు చంద్రబాబు సృష్టిస్తున్నవే అన్న కొడాలి నానీ
ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం వుందని చెబుతున్నారని అయితే టీడీపీ సమావేశాలకు 500 మంది కూడా రావడం లేదని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు . చంద్రబాబు మాటలు వింటే రైతులకు న్యాయం జరగదు అని , రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుతం దృష్టికి తమ సమస్యలను తీసుకురావాలని నానీ సూచించారు . రాష్ట్రంలో కావాలని చంద్రబాబు అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పిన నానీ నేడు హైపవర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.