వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాశం జిల్లా:కుప్పకూలిన విద్యుత్ స్థంభాలు...రైళ్ల రాకపోకలకు అంతరాయం

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా:ఎపిలో రైల్వే శాఖకు సంబంధించి పెను ముప్పు తప్పింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రైళ్ల రాకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వివరాల్లోకి వెళితే...

చెన్నై-విజయవాడ మార్గంలో గూడ్స్ ప్రయాణిస్తుండగా నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో దిగువమెట్ట-చెలమ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ పై ఒక చోట రైల్వే విద్యుత్ తీగలు కిందకి జారాయి. ఈ విషయాన్ని గమనించని గూడ్స్ డ్రైవర్ రైలును ముందుకు నడిపాడు. దీంతో ఈ తీగలు గూడ్స్ పై భాగానికి తగులుకొని ఆరు విద్యుత్ స్తంభాలు నేలను పెకలించుకొని ట్రాక్ కు ఇరువైపుల చెల్లా చెదురుగా పడ్డాయి. స్థానికుల అరుపులతో అప్రమప్తమైన గూడ్స్ డ్రైవర్ రైలు నిలిపివేశాడు.

Train services to the Bangalore to Vijayawada route

మరోవైపు ఈ ఘటన కారణంగా బెంగుళూరు-విజయవాడ రూట్ నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి. అయితే విద్యుతీకరణ పనుల్లో నాణ్యత లేకపోవడం కారణంగానే విద్యుత్ తీగలు ఇలా కిందకి జారినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది.

English summary
Prakasam district:Train services to the Bangalore to Vijayawada route have been stopped due to collapse of railway electric poles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X