వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

India Corona Cases Today: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు, 2 నెలల కనిష్టం: 15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గుదల కనిపించింది. తాజా కేసులు లక్షకు దిగిరావడం గమనార్హం. సుమారు రెండు నెలల తర్వాత ఇదే కనిష్టం. దేశంలో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. 94శాతానికి చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.

Recommended Video

Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu
దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 15,87,589 నమూనాలను పరీక్షంగా.. కొత్తగా 1,00,636 కరోనా కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడినవారి సంఖ్య 2,89,09,975కు చేరింది.

దేశంలో తాజాగా 2427 మంది మృతి.. రికవరీ పెరిగింది..

దేశంలో తాజాగా 2427 మంది మృతి.. రికవరీ పెరిగింది..

గడిచిన 24 గంటల్లో 2427 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి 3,49,186 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజే దేశంలో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,71,59,180కి చేరింది.

15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

దేశంలో రికవరీ రేటు 94 శాతానికి చేరగా, పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు నమోదైంది.

ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13.90 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23కోట్లకు చేరింది.

లాక్‌డౌన్, కర్ఫ్యూ సడలింపుల దిశగా రాష్ట్రాలు

లాక్‌డౌన్, కర్ఫ్యూ సడలింపుల దిశగా రాష్ట్రాలు

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలను సడలిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఐదు కేటగిరీల్లో సడలింపులను ఇస్తోంది. ఢిల్లీలో కూడా మినహాయింపులను లాక్‌డౌన్ ప్రకటించింది. షాపులను సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతిచ్చింది. ఢిల్లీలో మెట్రో సేవలు కూడా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, 50శాతం కెపాసిటీతోనే నడవనున్నాయి. యూపీలోనూ కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. హర్యానా, సిక్కింలలో మాత్రం జూన్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే జూన్ 14 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లోనూ సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది.

English summary
India's Covid chart continued to improve today with the country recording 1.06 lakh cases, a drop of 12% from yesterday's 1.14 lakh infections that were reported to be the lowest in two months. The country's caseload now stands at 2.89 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X