కేరళలో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ కూటమి టఫ్ ఫైట్.. రాహులే ప్రధాని అని..?
కేరళలో ఎల్డీఫ్ కూటమి విజయం సాధిస్తోందని ప్రీ పోల్ సర్వే తెలిపింది. టైమ్స్ నో సీ ఓటర్ పోల్ సర్వే ప్రకారం.. 140 సీట్లలో 82 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. యూడీఎఫ్ 56 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ మాత్రం 1 సీటు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎల్డీఎఫ్ 78-86 సీట్లు.. యూడీఎఫ్ 52-60, బీజేపీ 2 వరకు, ఇతరులు 2 సీట్లలో విజయం సాధించింది.
ఎల్డీఎఫ్ 0.6 శాతం తగ్గించింది. 2016లో 43.5 శాతం ఉండగా.. ఇప్పుడు 42.9 శాతం గెలుచుకుంటుందని అంచనా వేసింది. యూడీఎప్ 38.8 శాతం ఉండగా.. 37,6 శాతం ఇప్పుడు పడిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ పాపులారిటీ 42.34 శాతం పెరిగింది. ప్రజలు ఆయనకు బ్రహ్మరతం పడుతున్నారు.
కేరళ ప్రజలు 55.84 శాతం మంది ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు అనుకూలంగా ఉన్నారు. కేవలం 31.95 శాతం మంది మాత్రమే నరేంద్ర మోడీకి జై కొట్టారు.