మోడీకి అరుదైన అవకాశం... మాల్దీవుల పార్లమెంట్లో మోడీ ప్రసంగం
నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది.. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి సారీ మాల్దీవుల పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఇందుకు సంబంధించి ఆదేశ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మాణం చేసింది.
రెండోసారి ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 7,8తేదీల్లో ఐలాండ్ దేశమైన మాల్దీవులకు వెళ్లనున్నారు. దీంతో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ సోలీహ్ అభ్యర్థన మేరకు పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ నషీద్ దీన్ని ఆమోదించారు. దీంతో మాల్దీవుల పార్లమెంట్లో ఉన్న 80 మంది సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు.
కాగా గత నవంబర్లో సోలీహ్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారోత్సవానికి మోడీ హజరయ్యారు. కాగా మాల్దీవులకు భారత దేశం 1.4 బిలియన్ల ఆర్ధిక సహాయాన్ని కూడ ఆ దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించినప్పడు ప్రకటించింది.కాగా మోడీ ప్రమాణాస్వీకారం సందర్భంగా ఆదేశానికి చెందిన అధ్యక్షుడితోపాటు పలువురు అభినందనలు తెలిపారు.