వావ్.. ఈరోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వచ్చాయి: మీడియాపై ట్రంప్ సెటైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై సెటైర్ వేశారు. ఫేక్ న్యూస్ మీడియా అంటూ ఎద్దేవా చేశారు. మీడియా నిజాలను రాయదని, చెప్పదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై సెటైర్ వేశారు. ఫేక్ న్యూస్ మీడియా అంటూ ఎద్దేవా చేశారు. మీడియా నిజాలను రాయదని, చెప్పదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
ట్రంప్ కి మీడియా అంటే ఆదినుంచీ ఆగ్రహమే. ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు ఆయన మీడియాను ఏకిపారేయడం మామూలే. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ మీడియాపై విరుచుకుపడే వారు.
తాజాగా బుధవారం కూడా ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు. 'వావ్.. ఈరోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వచ్చాయి.. నేను సరిగ్గా ఏం చెప్పానో, ఏం చేస్తున్నానో తెలుసుకోవలసిన అవసరం మీడియాకు లేదు.. ఫేక్ న్యూస్ మీడియా నియంత్రణ కోల్పోయింది..'' అంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాలో తన అక్కసును వెళ్లగక్కారు.
నిజానికి తనకు మీడియా కన్నా ట్విట్టర్ అంటేనే ఇష్టమని తరచూ ట్రంప్ చెబుతుంటారు. మీడియా నిజాలను రాయదు, చెప్పదు అంటూ ఎద్దేవా చేశారు. తన ప్యూర్టోరికో పర్యటనకు సంబంధించి మీడియా కవరేజి గురించి ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు.
A great day in Puerto Rico yesterday. While some of the news coverage is Fake, most showed great warmth and friendship.
— Donald J. Trump (@realDonaldTrump) October 4, 2017
Wow, so many Fake News stories today. No matter what I do or say, they will not write or speak truth. The Fake News Media is out of control!
— Donald J. Trump (@realDonaldTrump) October 4, 2017