కేసీఆర్ మరో యాగం.. ఎందుకు.. ఎప్పుడు..
జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో చండీ యాగం చేయాలా లేక హోమం చేయాలా అన్న దానిలో క్లారిటీ లేదు.
ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కన్నెపల్లిలో యాగం చేయడానికి స్థలాన్ని పరిశీలించారు పండితులు. ఇక మేడిగడ్డ లో హోమం చేయడానికి స్థల పరిశీలన చేశారు సీఎంవో అధికారులు. ఇక ఈ నేపథ్యంలో యాగం చేస్తున్నారా హోమం చేస్తున్నారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డలో హోమం
ఎందుకంటే.. కాళేశ్వరం సమీపంలో 21న సీఎం చండీయాగం చేస్తారని పండితులు భావిస్తుండగా, మేడిగడ్డ వద్ద హోమం చేసి బ్యారేజీ గేట్లను పైకెత్తి బ్యారేజీని ప్రారంభిస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు సీఎంవో భద్రతా కార్యదర్శి రాజశేఖర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ మురళీధర్రావుతోపాటు ఇతరఅధికారులు గురువారం మేడిగడ్డ వద్ద స్థలపరిశీలన చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని దానిపై పరిశీలన జరిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు ముందుగా ముఖ్యమంత్రి మేడిగడ్డ కు చేరుకుంటారు కాబట్టి మేడిగడ్డ లోనే హోమం జరిపిస్తారని అధికారులు, స్థానికులు అంచనా వేస్తున్నారు.

కన్నెపల్లిలో యాగ స్థలాన్ని పరిశీలించిన సీఎం పీఎస్ , పురోహితులు
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం శివారులోని కన్నెపల్లి వద్ద 21న ముఖ్యమంత్రి నిర్వహించే యాగ స్థలాన్ని శుక్రవారం సీఎం పీఎస్ పరమేశ్వర్రెడ్డి, సీఎం పురోహితులు గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్ శర్మ పరిశీలించారు. యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్తో చర్చించారు. ఇక దీంతో రెండు చోట్ల యాగం జరగనుంది అన్న భావన కూడా వ్యక్తమవుతోంది.
కన్నెపల్లి పంప్హౌస్ వద్ద, గ్రావిటీ కెనాల్వద్ద, అప్రోచ్ కెనాల్ దగ్గర, వ్యూపాయింట్ వద్ద స్థలాలను పరిశీలించారు.

రెండు చోట్లా సీఎంవో అధికారుల పరిశీలన .. ఏర్పాట్లపై అధికారుల టెన్షన్
కన్నెపల్లి పంప్హౌస్ ప్రారంభించడానికి ముందే సుమారు మూడు గంటలపాటు కేసీఆర్ యాగం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయం మేడిగడ్డలో హోమం చేసి.. మధ్యాహ్నం కాళేశ్వరం వద్ద యాగం చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది . సీఎం షెడ్యూలు అధికారికంగా విడుదల కాకపోవడంతో ఏర్పాట్లు ఎక్కడ చేయాలో తెలియక అధికారులు టెన్షన్ పడుతున్నారు పడుతున్నారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసిన సీఎం కేసీఆర్ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కెసిఆర్ నిర్వహించే యాగాల విషయంలో క్లారిటీ లేక కాస్త టెన్షన్ పడుతున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications