హోం
 » 
అశోక్ గెహ్లోట్

అశోక్ గెహ్లోట్

అశోక్ గెహ్లోట్

అశోక్ గెహ్లోట్ రాజ‌స్థాన్ రాష్ట్రానికి 1998 నుంచి 2003 మ‌రియు 2008 నుంచి 2013 వ‌ర‌కు రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. చాలా సార్లు కేంద్ర మంత్రిగా కూడా ఆయ‌న సేవ‌లందించారు.

అశోక్ గెహ్లోట్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

అశోక్ గెహ్లోట్ రాజ‌స్థాన్ రాష్ట్రానికి 1998 నుంచి 2003 మ‌రియు 2008 నుంచి 2013 వ‌ర‌కు రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. చాలా సార్లు కేంద్ర మంత్రిగా కూడా ఆయ‌న సేవ‌లందించారు. న్యాయవిద్య మ‌రియు సైన్స్‌ల‌లో ఆయ‌న గ్రాడ్యుయేష‌న్‌తో పాటు ఎకనామిక్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ సాధించారు.

By Moumi Majumdar Updated: Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

అశోక్ గెహ్లోట్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు అశోక్ గెహ్లోట్
పుట్టిన తేదీ 03 May 1951 (వ‌య‌స్సు  73)
పుట్టిన ప్రాంతం మ‌హామందిర్, జోధ్‌పూర్‌, రాజ‌స్థాన్
పార్టీ పేరు Indian National Congress
విద్య Post Graduate
వృత్తి ప్ర‌స్తుత రాజ‌స్థాన్ శాస‌న‌స‌భ్యుడు మ‌రియు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి
తండ్రి పేరు బాబు ల‌క్ష్మ‌ణ్ సింగ్ గెహ్లోట్
తల్లి పేరు -
మతం హిందూ
వెబ్‌సైట్ ashokgehlot.in
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

అశోక్ గెహ్లోట్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹6.54 CRORE
ఆస్తులు :₹6.54 CRORE
బాధ్యతలు: N/A

అశోక్ గెహ్లోట్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

1971 లో తూర్పు బెంగాలీ శ‌ర‌ణార్థుల సంక్షోభం త‌లెత్తిన స‌మయంలో ఆ శ‌ర‌ణార్థుల శిబిరాల‌లో వారికి గెహ్లోట్ సేవ‌లందించారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఆ శిబిరాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు గెహ్లోట్‌ను ఆమె తొలిసారిగా క‌లిసి అత‌ని సంస్థాగ‌త నైపుణ్యాల‌ను ముగ్ధురాల‌య్యారు. దీంతో ఆమె గెహ్లోట్‌ను రాజ‌స్థాన్ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ మొద‌టి అధ్య‌క్షుడిగా నియ‌మించారు.

అశోక్ గెహ్లోట్ రాజకీయ జీవితం

2018
  • డిసెంబ‌రు 2018 లో రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో గెహ్లోట్ స‌ర్థార్‌పుర సీటు నుంచి గెలిచారు. బీజేపీకి చెందిన శంభుసింగ్‌పై ఆయ‌న 45,597 ఓట్ల తేడాతో గెలిచారు. డిసెంబ‌రు 17, 2018 న రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
2017
  • ఆల్ఇండియా కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మితుల‌య్యారు.
2008-13
  • శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో స‌ర్ధార్‌పుర నుంచి ఆయ‌న మ‌రోసారి పోటీ చేశారు. మ‌రియు రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు. డిసెంబ‌రు 13, 2013 వ‌ర‌కు విజ‌యవంతంగా ఐదేళ్ల ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేశారు.
2004-08
  • ఆల్ఇండియా కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అయ్యారు.
2003
  • రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో గెహ్లోట్ గెలిచారు. అయితే బీజేపీకి చెందిన వ‌సుంధ‌ర రాజే సీఎం పీఠం ఎక్క‌డంతో ఆయ‌న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.
1998-2003
  • డిసెంబ‌రు 1, 1998 లో గెహ్లోట్ రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఉపఎన్నిక‌ల‌లో ఆయ‌న స‌ర్థార్‌పుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. డిసెంబ‌రు 8, 2003 వ‌ర‌కు ఆయ‌న రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు.
1998
  • 12 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. బీజేపీకి చెందిన జ‌శ్వంత్ సింగ్ బిష్ణోయిని మ‌రోమారు ఓడించారు. కానీ డిసెంబ‌రు నెల‌లో ఆయ‌న త‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.
1997-99
  • రాజ‌స్థాన్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు.
1996-98
  • లోక్‌స‌భ‌లో విదేశీ వ్య‌వ‌హారాల కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.
1996-98
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో జోధ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీకి చెందిన జ‌స్వంత్ సింగ్ పై నెగ్గారు. 2,42,176 ఓట్ల తేడాతో ఆయ‌న‌పై గెల‌వ‌డం విశేషం.
1994-97
  • రాజ‌స్థాన్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌విని మ‌రోసారి చేప‌ట్టారు.
1991-98
  • 10 మ‌రియు 11 వ లోక్‌స‌భ‌ల‌లో రైల్వేల‌పై నియ‌మించిన స్టాండింగ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.
1991-96
  • లోక్‌స‌భ‌లో స‌మాచార కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు.
1991-93
  • కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ స‌హాయ‌మంత్రి(స్వ‌తంత్ర హోదా)గా ప‌ని చేశారు.
1991-96
  • జోధ్‌పూర్ స్థానం నుంచి 10 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. బీజేపీకి చెందిన న‌రైన్ బిష్ణోయిని ఓడించారు.
1989-89
  • రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో హోం మ‌రియు ప‌బ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు.
1985-89
  • రాజ‌స్థాన్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు.
1984-89
  • జోధ్‌పూర్ నుంచి ఎనిమిద‌వ లోక్‌స‌భ‌కు గెహ్లోట్ ఎన్నిక‌య్యారు. బీజేపీకి చెందిన బ‌ల్వీర్ సింగ్‌ను ఆయ‌న ఓడించారు.
1984-85
  • కేంద్ర ప‌ర్యాట‌కం మ‌రియు పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా సేవ‌లందించారు.
1984-84
  • కేంద్ర క్రీడ‌ల శాఖ స‌హాయ‌మంత్రిగా ప‌ని చేశారు.
1983-84
  • కేంద్ర ప‌ర్యాట‌క మ‌రియు పౌర విమాన‌యాన శాఖ స‌హాయ‌మంత్రిగా ప‌ని చేశారు.
1982-83
  • కేంద్ర ప‌ర్యాట‌క శాఖ స‌హాయ మంత్రిగా ప‌ని చేశారు.
1982
  • రాజ‌స్థాన్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా గెహ్లోట్ నియ‌మితుల‌య్యారు.
1980-82
  • లోక్‌స‌భ‌లో ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు.
1980-84
  • జోధ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. జేఎన్‌పీకి చెందిన బ‌ల్బీర్ సింగ్ క‌చ్చ‌వాను ఆయ‌న ఓడించారు.
1979-82
  • జోధ్‌పూర్ జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్య‌క్షుడ‌య్యారు.
1974-79
  • కాంగ్రెస్ యువ‌జ‌న విభాగ‌మైన ఎన్ఎస్‌యూఐలో అశోక్ గెహ్లోట్ చేరారు. అన‌తికాలంలోనే ఎన్ఎస్‌యూఐ రాజ‌స్థాన్ రాష్ట్ర అధ్య‌క్షుల‌య్యారు.

గ‌త చ‌రిత్ర

1971
  • భార‌త‌దేశంలోని తూర్పు రాష్ట్రాల‌లో తూర్పు బెంగాలీ శ‌ర‌ణార్థుల‌ సంక్షోభ స‌మ‌యంలో శ‌ర‌ణార్థుల శిబిరాల‌లో అశోక్ గెహ్లోట్ సేవ‌లందించారు.

అశోక్ గెహ్లోట్ సాధించిన విజయాలు

ఉచిత అంబులెన్సు సేవ‌లు మ‌రియు రాజీవ్ గాంధీ మెమోరియ‌ల్ బుక్ బ్యాంక్ వారిచే ఉచితంగా పుస్త‌కాల‌ను పంపిణీ చేసే భార‌త్ సేవా సంస్థాన్‌ను అశోక్ గెహ్లోట్ స్థాపించారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X