ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్నాథ్ సింగ్ మొదటగా తన కెరీర్ను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త నుంచి క్రమంగా ఎదిగి జనతా పార్టీలో చేరారు.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్నాథ్ సింగ్ మొదటగా తన కెరీర్ను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త నుంచి క్రమంగా ఎదిగి జనతా పార్టీలో చేరారు. 1977 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మీర్జాపూర్ స్థానం నుంచి జేఎన్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజహర్ ఇమాంను ఓడించారు. 1980, 85 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఓటమి చవి చూశారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను 1988లో రాజ్నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 1991లో రాష్ట్రంలో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.
1994 లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997 లో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా, 1999లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఆయన నియమితులయ్యారు. సుదీర్ఘమైన, మచ్చలేని కెరీర్, 2000 లో ఆయనకు యూపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. 2005లో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి నెగ్గి, 16 వ లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో హోమ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.