లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. బీజేపీ పుంజుకుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి బీజేపీ కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ను కూడా బీజేపీ నిలబెట్టుకోగలిగింది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసుగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
2018లో బీఆర్ఎస్ గెలుచుకున్న సీట్లలో సగం కూడా గెలవలేకపోవడంతో కాంగ్రెస్ 19 నుంచి 64కి ఎగబాకింది. మిజోరంలో జోరంతంగా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిజో పీపుల్స్ మూవ్మెంట్ అధికారంలోకి వచ్చింది. తాజా రాజకీయ పరిణామాలను తెలుసుకోవడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి.