సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆమె యునైటెడ్ ప్రొగ్రెసివ్ కూటమి ప్రభుత్వంలో సంకీర్ణ పార్టీల సమన్వయ కమిటీ ఛైర్పర్సన్గా పని చేశారు. శ్రీమతి గాంధీ డిసెంబరు 9, 1946 లో జన్మించారు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇంగ్లీషు, రష్యా మరియు ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవడం కోసం ఆమె విదేశీ భాషలు నేర్పించే స్కూలులో చేరారు. కేంబ్రిడ్జ్లో ఇంగ్లీషు భాషా కోర్సు చదువుతున్న సమయంలోనే రాజీవ్ గాంధీతో ఆమెకు పరిచయమేర్పడింది. అనంతరం 1968 లో న్యూఢిల్లీలో వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక మరియు మనవడు, మనవరాలు ఉన్నారు. శ్రీమతి గాంధీ తన వైవాహిక జీవితంలో ఎక్కువ భాగం ఒక మామూలు వ్యక్తిగా తన కుటుంబానికే సమయం కేటాయించారు. తన అత్తగారైన ఇందిరాగాంధీ గారి అధికారిక విధులలోనూ ఆమె చేదోడువాదోడుగా ఉన్నారు. తన భర్త రాజీవ్ గాంధీ 1984 నుంచి 1991 మధ్య ప్రధానమంత్రి మరియు విపక్షనేతగా ఉన్న సమయంలో కొంతకాలం ఆమె ప్రజా సేవ చేశారు. తన భర్త దేశ, విదేశీ పర్యటనలలో ఆయన వెన్నంటే ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని తన భర్త నియోజకవర్గం అమేథీలో ఆరోగ్య సంరక్షణ క్యాంపులు ఏర్పాటు చేయడం మరియు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు.
1991 మేలో తన భర్త హత్యకు గురయిన తర్వాత ఆయన స్మారకార్థం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా మేధోపరమైన మరో సంస్థ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్ను ఆమే ఏర్పాటు చేశారు. ఈ సంస్థల ఛైర్పర్సన్గా తన భర్త ఆశయాలను కొనసాగించే కార్యక్రమాలను ఆమె చేపట్టారు. ఇవేగాక మరెన్నో స్వచ్ఛంధ సంస్ధలను ముందుండి నడిపించారు.
1998 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోని నాయకుల డిమాండ్ల మేరకు ఆమె ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ఆమె 1998 ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
శ్రీమతి గాంధీ తొలిసారిగా 1999 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆమె తలకెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె రాయ్బరేలీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఎన్నికల అనంతరం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవి కూడా చేపడతారన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే ఆమె ఆ పదవికి డాక్టర్ మన్మోహన్ సింగ్ను ప్రతిపాదించి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపించాల్సిందిగా కోరారు. యూపీఏ ఛైర్పర్స్న్గానే గాక పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె వ్యవహరించారు.
సామాజిక-ఆర్థిక ప్రాధాన్యతలతో ప్రభుత్వానికి వివిధ సూచనలు సలహాలు అందించే జాతీయ సలహా కమిటీ(ఎన్ఏసీ) ఛైర్పర్సన్గానూ మే 2006 వరకు ఆమె వ్యవహరించారు. ఆమె నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ అందించిన సూచనల మేరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, జవహర్ లాల్ నెహ్రు పట్టణ రూపాంతరీకరణ మిషన్ మరియు జాతీయ పునరావాస విధానం వంటీ ఎన్నో కీలక పథకాలు అమల్లోకి వచ్చాయి.
| పూర్తి పేరు | సోనియా గాంధీ |
| పుట్టిన తేదీ | 09 Dec 1946 (వయస్సు 79) |
| పుట్టిన ప్రాంతం | విసెంజా, ఇటలీ |
| పార్టీ పేరు | Indian National Congress |
| విద్య | Others |
| వృత్తి | రాజకీయ నాయకురాలు |
| తండ్రి పేరు | స్టెఫానో మైనో |
| తల్లి పేరు | పావొలా మైనో |
| జీవిత భాగస్వామి పేరు | దివంగత శ్రీ రాజీవ్ గాంధీ |
| జీవిత భాగస్వామి వృత్తి | మాజీ ప్రధాన మంత్రి |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
| మతం | హిందూ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.